Breaking News

స్వీయ నియంత్రణతో కరోనాను బ్రేక్ చేద్దాం

స్వీయ నియంత్రణతో కరోనాను బ్రేక్ చేద్దాం

మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

సారథి, రామయంపేట: కరోనా చైన్ ను బ్రేక్ చేయాలంటే ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సూచించారు. గురువారం మెదక్​ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శ్రీహెల్త్ కేర్ ఫార్మసీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరూ కరోనా నిబంధనలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. కరోనా సెకండ్ వేవ్ సివియరిటీ ఎక్కువగా ఉన్నందున ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు. బయటకు వెళ్లినప్పుడు ప్రతిఒక్కరూ మాస్క్ ధరించి, సోషల్ డిస్టెన్స్​ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో నిజాంపేట సర్పంచ్ అనూష, ఉపసర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు కొమ్మట బాబు, నిజాంపేట ఎంపీటీసీ లహరి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్​ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.