Breaking News

గానుగ నూనె తయారీ కేంద్రం ప్రారంభం

గానుగ నూనె తయారీ కేంద్రం ప్రారంభం

సారథి, జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కట్టె గానుగ ద్వారా నూనె తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్రీనిధి, బ్యాంకుల ద్వారా లోన్లు ఇస్తూ ఆర్థికంగా అండగా ఉంటుందన్నారు. జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ.. మహిళలు స్వశక్తితో ఎదగాలని, సహజ బ్రాండ్ పేరుతో ఇప్పటికే జిల్లాలో అమ్మకాలు చేపట్టడం అభినందనీయమన్నారు. తమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారంతో జిల్లాలోని మహిళా సంఘాలకు తోడ్పాటు ఇస్తున్నామని అన్నారు. అనంతరం శ్రీనిధి ద్వారా మంజూరైన రూ.లక్ష చెక్కును మహిళా సంఘం సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, సర్పంచ్ చెరుకు జాన్, ఆత్మ చైర్మన్ రాజరెడ్డి, చంద్రారెడ్డి, పురిపాటి రాజారెడ్డి, సత్తిరెడ్డి, స్వామి రెడ్డి, నగేష్, ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షుడు మహేష్, ఐకేపీ ఏపీఎం గంగాధర్, జనార్ధన్, గంగన్న, సత్తవ్వ, మమత, లత పాల్గొన్నారు.