Breaking News

కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ వరం

కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ వరం

సారథి, కోడిమ్యాల: కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరమని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్​అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో రూ.79,84,280 విలువైన కళ్యాణలక్ష్మీ చెక్కులను 80 మంది లబ్ధిదారులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని కొనియాడారు. ప్రతిఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ సీఎం కేసీఆర్ సంక్షేమానికే పెద్దపీట కొనియాడారు. కరోనా తగ్గుముఖం పట్టిందేమో కానీ భౌతికదూరం పాటించకుండానే చెక్కులు పంపిణీ చేయడం పలు విమర్శలకు తావిచ్చింది.