Breaking News

బిజినేపల్లి ఎస్సైగా కె.శ్రీనివాసులు

బిజినేపల్లి ఎస్సైగా కె.శ్రీనివాసులు

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి నూతన ఎస్సైగా కె.శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఆయన మహబూబ్​ నగర్​ సీసీఎస్​ లో పనిచేశారు. బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై నాగశేఖర్​ రెడ్డి వీఆర్​ కు వెళ్లారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై కె.శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించాలని కోరారు. పైరవీకారులను ఆశ్రయించవద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలంతా సామరస్యాలతో మెలగాలని కోరారు. శాంతిభద్రతలకు సహకరించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *