Breaking News

వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం

వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం

సారథి న్యూస్, రామడుగు: రామడుగు మండలంలోని వెదిర గ్రామంలో వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం గురువారం వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య అంగరంగ వైభవంగా సాగింది. దుర్ముట్ల లక్ష్మీ, నర్సింహారెడ్డి, దుర్ముట్ల హారిక కిషన్ రెడ్డి, సందూరి జ్యోతి, రవీందర్ రెడ్డి దగ్గరుండి జరిపించారు. స్వామి వారిని ఎదుర్కోలుగా తీసుకొచ్చి ముత్యాల పందిరిలో కూర్చోబెట్టగా వేదపండితులు కల్యాణం జరిపించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించి కట్నకానుకలు సమర్పించారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ చింతల కోమల్ రెడ్డి, నాయబ్ తహసీల్దార్ కిరణ్ కుమార్​రెడ్డి, ఎంపీడీవో రాజీవ్ మల్హోత్ర, సుంకేదీవెన దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెన్నమానేని రాజేందర్ రావు, టీపీసీసీ మహిళా ప్రెసిడెంట్ నేరెళ్ల శారద, సర్పంచ్ తీగల సంగీత, వీడీసీ రాజశేఖర్, డీసీసీ ఉపాధ్యక్షుడు వెన్న రాజమల్లయ్య, మాజీ ఎంపీపీ సూదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.