Breaking News

గాంధీజీకి ఘననివాళి

గాంధీజీ ఘననివాళి

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కలెక్టరేట్​లో శనివారం జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్ లోని అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో డీఆర్వో రమాదేవి, డీసీవో విజయ్ భాస్కర్ రెడ్డి, ములుగు తహసీల్దార్ ఎం.సత్యనారాయణస్వామి, కలెక్టరేట్ ఏవో జె.శ్యాంకుమార్ పాల్గొన్నారు.

వాజేడు మండలం కేంద్రంలో గాంధీజీ వర్ధంతి వేడుకలు

వాజేడులో గాంధీజీ వర్ధంతి
వాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆఫీసుల్లో శనివారం గాంధీజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజేడు వైద్యసిబ్బంది మౌనం పాటించారు. కుష్ఠు వ్యాధిపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్పర్శ్ లెప్రసీ అవేర్​నెస్​ కాంపెయిన్ ను జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్​వో డాక్టర్​ డి.వెంకటేశ్వర్​రావు తెలిపారు. శరీరంపై ఉన్న స్పర్శ, రంగులేని మచ్చలు, నూనె కారుతున్న చర్మం కలిగి ఉన్న వ్యక్తులను వెంటనే గుర్తించి వారికి బహుళ ఔషధం చికిత్స ఇవ్వనున్నట్లు తెలిపారు. డాక్టర్ యమున, డాక్టర్ మహేందర్, డిప్యూటీ తహసీల్దార్, సర్పంచ్ ఆదినారాయణ, ఏఈ ప్రశాంత్, ఎంపీడీవో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, సెక్రటరీ అశోక్, సీహెచ్ వో సూర్యప్రకాశ్​రావు పాల్గొన్నారు.