![మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ చిత్రపటానికి క్షీరాభిషేకం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/07/23.jpg?fit=655%2C293&ssl=1)
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంట రోడ్డుకు నిధులు సమకూర్చి అభివృద్ధి చేసినందుకు గానూ మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ గాలన్న చిత్రపటానికి బీజేపీ నాయకులు ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పెద్ది వీరేశం మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ సేవలను గ్రామస్తులు ఎప్పటికీ మరిచిపోరని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి జతంగి సురేష్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు పాలకుర్తి శ్రీకాంత్, బూత్ అధ్యక్షుడు రాపెళ్లి సంజీవ్, దాసరి వంశీ, వెంకటేష్, అఖిల్, విష్ణు, కుడిదెల రఘు, బొడ్డు అజయ్ తదితరులు పాల్గొన్నారు.