Breaking News

పండ్లు, మాస్కులు పంపిణీ

పండ్లు, మాస్కులు పంపిణీ

సారథి, వేములవాడ: ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఏడేళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ మండలాధ్యక్షుడు జక్కుల తిరుపతి ఆధ్యర్యంలో పేదలు, రైతులు, హమాలీలకు సరుకులు, మాస్కులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా జిల్లా మహిళామోర్చా అధ్యక్షురాలు బర్కం లక్ష్మీనవీన్ యాదవ్ పాల్గొన్నారు. మండలంలోని ఫాజిల్ నగర్, తుర్కషినగర్, వట్టెంల, నమిలిగుండుపల్లి, నుకలమర్రి గ్రామాల్లో సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నందగిరి రాహుల్ గౌడ్, మండలాధ్యక్షుడు అంజనీకుమార్, ప్రధాన కార్యదర్శి పోగుల రాకేశ్, మంద అరుణ్ కుమార్, ఉపాధ్యక్షుడు రెండ్ల మహేష్, చింతం కుమార్, పొన్నం మహేష్, పిట్టల ప్రశాంత్, సంబు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.