Breaking News

రాజన్న సన్నిధిలో మత్స్యశాఖ కమిషనర్

రాజన్న సన్నిధిలో మత్యశాఖ కమిషనర్

సారథి, వేములవాడ: దక్షిణకాశీ ఆలయంగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబసమేతంగా రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్య దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. అభిషేకం అనంతరం లడ్డూ ప్రసాదం అందజేశారు.