Breaking News

రక్తదానం గొప్పకార్యం

రక్తదానం గొప్పకార్యం

  • పారిశ్రామికవేత్త కిషోర్ కుమార్

సారథి, మానవపాడు: ప్రముఖ పారిశ్రామిక వేత్త జల్లాపురం కిషోర్ కుమార్ జన్మదిన సందర్భంగా యువసైన్యం ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో యువకులు వచ్చి రక్తదానం చేశారు. కిషోర్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై యువకులతో మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో నిరుపేద కుటుంబాలకు బ్లడ్ ఉచితంగా లభిస్తుందన్నారు. జిల్లాలో రక్తదాన శిబిరాలకు తన సహకారం ఉంటుందన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యువసైన్యం ఆర్గనైజర్స్,
రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ వేనిమ తేజశ్రీ సిబ్బంది రాధ, గంగాభవాని, రామకృష్ణ, ఫిరోజ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.