Breaking News

269 కరోనా కేసులు నమోదు



సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా పాజిటివ్​ ఉధృతి పెరుగుతోంది. బుధవారం తాజాగా 269 కేసులు నమోదయ్యాయ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 5,675కు చేరింది. ఇందులో యాక్టివ్​ కేసులు 2,412 ఉన్నాయి. ఇప్పటి వరకు 3071 మంది వ్యాధి బారినుంచి కోలుకున్నారు. బుధవారం ఒకరు చనిపోయారు. దీంతో మొత్తంగా తెలంగాణలో 192 మంది చనిపోయారు. తాజాగా అత్యధికంగా 214 కేసులు జీహెచ్ఎంసీ పరిధి నుంచే నమోదయ్యాయ.