Breaking News

హార్థిక్​పటేల్​కు కీలకపదవి

న్యూఢిల్లీ: ​యువనేత హార్థిక్​పటేల్​ కు కాంగ్రెస్​పార్టీ కీలకపదవిని కట్టబెట్టింది. కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ.. హార్థిక్​ను గుజరాత్​ పీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్​గా నియమించారు. 26 ఏండ్ల హార్థిక్​పటేల్​ పిన్న వయసులో రాజకీయరంగప్రవేశం చేశారు. గుజరాత్​లోని బలమైన సామాజికవర్గమైన పాటిదార్ల రిజర్వేషన్ల కోసం ఆయన అనేక పోరాటాలు చేశారు. ఈ పోరాటం దేశరాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. అప్పటివరకు బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్న పాటిదార్లు ఆపార్టీకి దూరమై హర్థిక్​ వెంట నడిచారు. హార్థిక్​కు కీలకపదవిని అప్పజెప్పి గుజరాత్​లో బలపడేందుకు కాంగ్రెస్​ పావులు కదుపుతున్నదని పలువరు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా తన నియామకం పట్ల హార్థిక్​పటేల్​ హర్షం వ్యక్తంచేశారు. కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్​కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్​లో కాంగ్రెస్​పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తనవంతు కృషిచేస్తానని.. పార్టీ సీనియర్లతో కలిసిపనిచేస్తానని చెప్పారు.