![మొక్కనాటుతున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/FFFFFFFFFFFFFFF.jpg?fit=1280%2C590&ssl=1)
సారథిన్యూస్, ఆమన్గల్: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం ఎంతో గొప్ప కార్యక్రమమని
ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఎమ్మెల్సీ వెంట ఆమనగల్ ఎంపీపీ అనితా విజయ్, టీఆర్ఎస్ నాయకులు జంగయ్య, బాబా, రవీందర్, శివలింగం, శేఖర్, అల్లాజీ, శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, శేఖర్, నరేశ్నాయక్ తదితరులు పాల్గొన్నారు