Breaking News

సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం

సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మెదక్ డీసీసీ ఆఫీసులో డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి జెండా ఎగరవేసి, కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని 4 కోట్ల ప్రజల కోరిక మేరకు సోనియాగాంధీ ఇచ్చారని, ప్రజలు కలలుగన్న తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ కూడా నెరవేరలేదని, అవినీతికి, అక్రమాలకు నిలయంగా రాష్ట్రం మారిందని ఆరోపించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలను అమలుచేయడంలో విఫలమైందన్నారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సుప్రభాత రావ్ , పీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, పీసీసీ కార్యదర్శి అవులా గోపాల్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి సోమన్నగారి లక్ష్మి, రవీందర్ రెడ్డి, బాలకృష్ణ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్యాణి, ఆంజనేయులు, పట్టణాధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపీపీ రమేష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పల్లె రామచందర్ గౌడ్ పాల్గొన్నారు.