![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/sujatha.jpeg?fit=640%2C457&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: బంజారాహిల్స్ భూ వివాదం కేసులో షేక్పేట తహసీల్దార్ సుజాత సోమవారం అరెస్ట్ అయ్యారు. ఖలీద్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో ఆమెను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెను మూడు రోజులుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్ సెక్టార్ ఎస్సై రవీంద్ర నాయక్ను ఇప్పటికే అధికారులు రిమాండ్కు తరలించారు. తాజా అరెస్ట్తో ఆ సంఖ్య ముగ్గురికి చేరింది.