Breaking News

వ్యాయామ విద్య ఆన్ లైన్ క్లాసెస్​

సారథి న్యూస్, మహబూబ్ నగర్ : ఈనెల 27 నుండి 30 వరకు తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం, ఈఎల్ఎంఎస్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాయామ విద్య ఆన్​లైన్​ క్లాసెస్​ ను జిల్లాలోని పీఈటీలు, పీడీలు వినియోగించుకోవాలని సంఘం మహబూబ్​ నగర్​ జిల్లా అధ్యక్షుడు దూమర నిరంజన్, ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య బుధవారం కోరారు.

మొదటి రోజు సెషన్ లో భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్ తమ విలువైన సలహాలు, సూచనలు అందిస్తారని పేర్కొన్నారు. పీఈటీలు ప్రతి విద్యార్థికీ వ్యాయామ విద్య అదేవిధంగా కృషి చేయాలన్నారు. ఫౌండేషన్ సభ్యురాలు ఆల్ కియా ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ ఎక్ససైజ్, ఫిజికల్ ఇన్ యాక్టివిటీ, మొదలగు వ్యాయామ విద్య విషయాలపై లోతైన సుదీర్ఘమైన వివరణలు అందించారు. గురువారం జరిగే ఆన్​లైన్​ క్లాసెస్​ మైనర్ గేమ్స్ గురించి ప్రొఫెసర్ అశ్విని కుమార్ వివరిస్తారని తెలిపారు.