Breaking News

వైఎస్సార్​ ఆశయ సాధనకు కృషి

వైఎస్సార్​ ఆశయ సాధనకు కృషి

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి వేడుకలను నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్ ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల చెక్ పోస్టు దామోదరం సంజీవయ్య సర్కిల్ సమీపంలోని ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్​ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలుచేశారని కొనియాడారు. తాగు, సాగునీరు అందించిన ఘనత వైఎస్సార్​కే దక్కిందన్నారు. ఆయన ఆశయసాధనకు కాంగ్రెస్​పార్టీ కృషిచేస్తుందన్నారు.

రాహుల్​గాంధీని ప్రధానమంత్రి చేయాలని కలలుగన్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భరత్ కుమార్ ఆచారి, కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ బత్తుల చిన్నయ్య, జిల్లా మైనార్టీ నాయకులు పఠాన్ హబీబ్ ఖాన్, బీసీసెల్ నాయకులు బోయ నాగరాజు, యువజన కాంగ్రెస్ నాయకులు విజయ్ యాదవ్ అఖిల్, రాంబాబు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.