![లారెక్కిన ప్రయాణికుడికి కరోనా](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/karoona-virus-2-e1587917174235.jpg?fit=327%2C306&ssl=1)
సారథి న్యూస్, రంగారెడ్డి: కరోనా లక్షణాలతో ఉన్న ఓ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరో 58 మంది హమాలీ కార్మికులను హోమ్ క్వారంటైన్ కు పంపించారు. రాజస్థాన్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు గన్నీ బ్యాగ్స్ లోడ్ తో వచ్చిన లారీలో ఎక్కిన ఓ ప్రయణికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు ప్రయాణించిన లారీ విషయమై పోలీసులు ఆరా తీయగా వలిగొండ లో ఉన్నట్లు గుర్తించి డ్రైవర్, క్లీనర్లను రంగారెడ్డి జిల్లా రావిరాల క్వారంటైన్ సెంటర్కు తరలించారు.
వారికి ఐదు రోజుల తరువాత టెస్ట్ చేయనున్నారు. గన్నీ బ్యాగులను అన్ లోడ్ చేసిన 58 మంది హమాలీ కార్మికులను వారి ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉంచారు. లారీ డ్రైవర్, క్లీనర్ లకు ముందుగా పాజిటివ్ వా? నెగెటివ్ వా? అనేది తేలాల్సి ఉంది. ఈలోపు 58 మందిలో ఈ ఎవరికైనా దగ్గు, జలుబు సమస్యలు తలెత్తితే పరీక్షలు నిర్వహిస్తారు.