![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/RITHIKAA.jpg?fit=921%2C1251&ssl=1)
తెలుగులో 2018లో వచ్చిన ‘గురు’ సినిమా ఫేమ్ రితికా సింగ్ ఆ సినిమాలోని నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆది పినిశెట్టి, తాప్సీ నటించిన ‘నీవెవరో’లో నటించింది. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు. దాంతో తమిళంలోనే తన పట్టు సాధిస్తోంది ఈ పంజాబీ ముద్దు గుమ్మ. రీసెంట్గా రితిక నటించిన ‘ఓ మై కడవులే’ అన్న చిత్రం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజయ్యింది. ‘సినిమా చాలా బాగుంది..’ అంటూ సూపర్స్టార్ మహేశ్బాబు ప్రశంసించారు కూడా. అయితే ఇప్పుడు లేటెస్ట్గా మల్టీ టాలెండ్ హీరో విజయ్ ఆంటోనీతో జోడీ కడుతోందట రితిక. త్వరలో బాలాజీ కుమార్ దర్శకత్వంలో ఓ మర్డర్ మిస్టరీ తెరకెక్కనుందట. దాదాపు స్క్రిప్టు వర్కు కూడా పూర్తయినట్టు సమాచారం. ఈ సినిమాని త్వరలోనే సెట్స్పైకి తీసుకెళ్లనున్నారట. ఈ సినిమాలో చాన్స్ కొట్టేసినందుకు తెగ సంబర పడుతోంది రితిక.