![](https://samajikasarathi.com/wp-content/themes/magazine-newspaper-pro/images/no-image.jpg)
ఆంధ్రప్రదేశ్
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/ys-jagan.jpeg?resize=640%2C403&ssl=1)
సారథి న్యూస్, అమరావతి: లాక్ డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుజరాత్ సీఎం విజయ్ రూపానీని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఫోన్ లో మాట్లాడారు. వసతి, భోజన సదుపాయాల విషయంలో అసౌకర్యాలు లేకుండా చూడాలని కోరారు. సానుకూలంగా స్పందించిన గుజరాత్ సీఎం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.