Breaking News

మత్స్యకారులను కాపాడండి

ఆంధ్రప్రదేశ్​

ఏపీ సీఎం వైఎస్​ జగన్​ మోహన్​రెడ్డి

సారథి న్యూస్​, అమరావతి: లాక్‌ డౌన్‌ కారణంగా గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ జగన్ మోహన్​ రెడ్డి గుజరాత్​ సీఎం విజయ్ రూపానీని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఫోన్​ లో మాట్లాడారు. వసతి, భోజన సదుపాయాల విషయంలో అసౌకర్యాలు లేకుండా చూడాలని కోరారు. సానుకూలంగా స్పందించిన గుజరాత్‌ సీఎం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.