![బొగత జలపాతం ఓపెన్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/VJD-11.jpg?fit=677%2C351&ssl=1)
సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లాలోని వాజేడు మండలం చికుపల్లి అటవీ పాంత్రంలో ఉన్న బొగత జలపాతాన్ని వెంకటాపురం రేంజ్ ఆఫీసర్, వాజేడు ఎస్సై తిరుపతి రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. బొగత జలపాతానికి వచ్చే పర్యాటకులు అటవీ అధికారులు చెప్పిన జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరి కట్టుకుని బొగత జలపాతం సందర్శనకు రావాలని సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. చిన్నారులు, వృద్ధులను అనుమతించేది లేదని స్పష్టంచేశారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు చంద్రమౌళి, వాసు, నారాయణ, విజయ్, చక్రి, బొగత సిబ్బంది వెంకటకృష్ణ, వినోద్ కుమార్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/VJD22.jpg?resize=640%2C272&ssl=1)