![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/student-girl-sucide.jpg?fit=275%2C183&ssl=1)
న్యూఢిల్లీ: చిన్న, చిన్న విషయాలకే టీనేజ్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారింది. తల్లిదండ్రుల పిల్లలను చేరదీయకపోవడం, వారికి మానసిక స్థైర్యం కల్పించకపోవడంతో ఇటువంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ బాలిక.. తనకంటే స్నేహితురాలికి ఎక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో ప్రాణం తీసుకున్నది. కాన్పూర్లోని ధమిఖేడకు చెందిన శ్రావణ్ కుమార్ కుమార్తె అనిశా ఓ ప్రైవేట్ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నది. ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ ఫలితాల్లో 82 శాతం మార్కులు వచ్చాయి. కాగా తన స్నేహితురాలికి తనకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని బాధతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రుల తమ పిల్లలను పట్టించుకోవాలని.. వారికి చదువుతోపాటు మానసికజ్ఞానం కూడా నేర్పించాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.