Breaking News

ప్లాస్మా దానం చేయండి

ప్లాస్మా దానం చేయండి

సారథి న్యూస్​, కర్నూలు: యావత్‌ ప్రపంచాన్ని క‌రోనా వణికిస్తున్న సంక్షోభ‌ పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని జయించిన వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని కర్నూలు కలెక్టర్ జి. వీరపాండియన్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ‘ప్లాస్మా దానం చేయండి.. ప్రాణదాతలు కండి’ పోస్టర్​ను ఆయన ఆవిష్కరించారు. ప్లాస్మాదానం చేసిన దాతలకు ప్రభుత్వం రూ.5వేల పారితోషికం అందిస్తుందన్నారు. జేసీ (సంక్షేమం) సయ్యద్ ఖాజామోహిద్దీన్, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పి.చంద్రశేఖర్, కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్​ డాక్టర్ జి.నరేంద్రనాథ్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు, సెట్కూరు సీఈవో టి.నాగరాజు నాయుడు పాల్గొన్నారు.