![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/MARRI.jpeg?fit=1152%2C648&ssl=1)
సారథి న్యూస్, బిజినేపల్లి: ఓ పేదింటి విద్యాకుసుమానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. బిజినేపల్లి మండలంలోని ఉడుగులకుంట తండా గ్రామనికి చెందిన సురేష్ కు ఒడిశాలోని సాంబల్పూర్ ఐఐఎంలో ఎంబీఏ సీటు వచ్చింది. చదవడానికి డబ్బులు లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నాడు. తల్లిదండ్రులు, స్థానిక నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే తనవంతు సాయం చేశారు. ఆయన వెంట జడ్పీటీసీ హరిచరణ్ రెడ్డి, కుర్మయ్య ఉన్నారు.