సారథి న్యూస్, రంగారెడ్డి : లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసి మానవత్వంతో ఆదుకోవాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం హయత్ నగర్ డివిజన్ లోని ద్వారకమైనగర్ కాలనీకి చెందిన 70 కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పరిశుభ్రత, భౌతిక దూరం పాటిస్తే కరోనాను నిర్మూలించవచ్చని సూచించారు. నిరుపేదల బాధలను తెలుసుకుని వారికి నిత్యావసర సరుకులు అందజేశానని తెలిపారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సభ్యులు కిషోర్, ఉగాది శివ, మనోజ్ యాదవ్, సాయి యాదవ్, మనోజ్, రోహిత్, ఉగాది బన్నీ పాల్గొన్నారు.
- April 25, 2020
- లోకల్ న్యూస్
- KAROONA
- LOCKDOWN
- టీపీసీసీ
- హయత్ నగర్
- Comments Off on పేదలను ఆదుకుందాం