![పూజా.. బిజీబిజీ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/12/POOJA.jpg?fit=439%2C625&ssl=1)
రెండు తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ మూవీస్ కూడా పూజ బ్యాగ్ లో ఉన్నాయి. సల్మాన్ ఖాన్తో ‘కభీ ఈద్ కభీ దివాలీ’, రణ్వీర్ సింగ్తో ‘సర్కస్’ మూవీ చేస్తోంది. ఇటు సౌత్, అటు నార్త్ ప్రాజెక్టులో ఒకేసారి నటిస్తోందంటే పూజ కెరీర్ మామూలుగా ప్లాన్ చేసుకోలేదు. ఇప్పడు గ్యాప్ లేని షూటింగ్ లతో బిజీ అయిపోయింది పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే. ప్రస్తుతం అఖిల్తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రభాస్తో ‘రాధేశ్యామ్’ చేస్తోంది. ఇటలీలో నెలరోజుల షెడ్యూల్ తర్వాత ‘రాధేశ్యామ్’ షూటింగ్ హైదరాబాద్లో రీసెంట్గా మొదలైంది. పూజ కూడా జాయినైంది. ఇప్పుడు లాస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. మలయాళ యాక్టర్ జయం రవితో పాటు భాగ్యశ్రీ, ప్రియదర్శి, సచిన్ ఖేడ్కర్, మురళీశర్మ, కునాల్ రాయ్ కపూర్ తదితరులు కూడా షూటింగ్లో పాల్గొంటున్నారు. నెలాఖరు నాటికి మొత్తంగా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 25తో పూజ పోర్షన్ కంప్లీటవుతుంది. యువీ క్రియేషన్స్, టీ సిరీస్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. వచ్చే సమ్మర్ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి..