Breaking News

పుష్కరాలకు నగరాన్ని తీర్చిదిద్దండి

పుష్కరాలకు నగరాన్ని తీర్చిదిద్దండి

సారథి న్యూస్, కర్నూలు: తుంగభద్ర నది పుష్కరాలకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అధికారులకు సూచించారు. గురువారం స్థానిక గెస్ట్​హౌస్​లో పవిత్ర తుంగభద్ర నది పుష్కరాలపై నగరపాలక సంస్థ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్​20వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు పవిత్రమైన తుంగభద్ర నది పుష్కరాలు జరుగుతున్నాయని, అప్పటిలోగా నగరంలోని అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా చేయాలని అధికారులకు సూచించారు. శానిటేషన్, రోడ్లు, తాగునీటి పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని సూచించారు. నది పుష్కరాల పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఈ సురేంద్రబాబు, డీఈ షాకీర్, డీఈ రాజశేఖర్, డీఈ రాధాకృష్ణ, డీఈ రవిప్రకాష్ నాయుడు, ఏఈ కృష్ణలత, ఏఈ జనార్దన్, ఏఈ శ్రీనివాస్​నాయుడు, డీఈ రసూల్, ఏఈ దినేష్, ఏడీ సుజాత, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.