Breaking News

పింఛన్లు పంపిణీ

సారథి న్యూస్, శ్రీకాకుళం: వైఎస్సార్​ పింఛన్​ కానుక కింద శ్రీకాకుళం జిల్లాలో రూ.87.38 కోట్లు పంపిణీ చేశామని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకుడు ఏ.కళ్యాణ చక్రవర్తి తెలిపారు. శుక్రవారం ఆయన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.

జిల్లాలో 3,65,334 మందికి రూ.87.38 కోట్ల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో వలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసినట్లు తెలిపారు.