Breaking News

పత్తిపై మిడతల దాడి

పత్తిపై మిడతల దాడి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ లో పత్తి పంటను మిడతలు ఆశించిన నేపథ్యంలో సంగారెడ్డి డాట్ సెంటర్ సైంటిస్ట్ డాక్టర్ రాహుల్ బుధవారం గ్రామాన్ని సందర్శించారు. మిడతలు ఆశించిన నడిపోల్లా బాలయ్య పత్తి పంటను పరిశీలించారు. ఈ మిడతలు దండు స్వభావం కలిగినవి, కొన్ని మొక్కలను మాత్రమే ఆశిస్తాయని ఆయన తెలిపారు. ఈ రకం మిడతలు ముందుగా పొలం గట్టు మీద గుడ్లు పెట్టి పదిరోజుల తర్వాత పిల్లలై మొక్కలను ఆశిస్తాయని వివరించారు. పొలం గట్లను శుభ్రం చేసుకోవాలని సూచించారు. మిడతలు ఆశించిన మొక్కల మీద క్లోరిఫైరిఫాస్ మందును పిచికారీ చేయాలని, చుట్టుపక్కల ఉన్న మొక్కల మీద వేప నూనె కషాయం పిచికారీ చేయాలని సైంటిస్ట్ డాక్టర్ రాహుల్ సూచించారు. పంటను పరిశీలించిన వారిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాం తదితరులు ఉన్నారు.