Breaking News

పండగ సందడే లేదు

సారథి న్యూస్, రామడుగు: వినాయక చవితి అంటే.. డీజేలు, పూజలు, డప్పుచప్పుల్లు, భజనలతో మారుమోగిది. కానీ కరోనా కోరలు చాస్తున్న ప్రస్తుత తరుణంలో పండగ సందడి పూర్తిగా తగ్గిపోయింది. చాలా చోట్ల వీధుల్లో విగ్రహాలను ప్రతిష్ఠించనేలేదు. కొన్ని గ్రామాల్లో ప్రతిష్ఠించినా.. మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ప్రతి సారి 15 నుంచి 20 విగ్రహాలను ప్రతిష్టించేవారు. కానీ ఈ సారి మాత్రం నిశ్శబ్ధం అలుముకున్నది. ప్రజలు తమ ఇండ్లల్లోనే విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నారు.