సారథి న్యూస్, రామడుగు: వినాయక చవితి అంటే.. డీజేలు, పూజలు, డప్పుచప్పుల్లు, భజనలతో మారుమోగిది. కానీ కరోనా కోరలు చాస్తున్న ప్రస్తుత తరుణంలో పండగ సందడి పూర్తిగా తగ్గిపోయింది. చాలా చోట్ల వీధుల్లో విగ్రహాలను ప్రతిష్ఠించనేలేదు. కొన్ని గ్రామాల్లో ప్రతిష్ఠించినా.. మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ప్రతి సారి 15 నుంచి 20 విగ్రహాలను ప్రతిష్టించేవారు. కానీ ఈ సారి మాత్రం నిశ్శబ్ధం అలుముకున్నది. ప్రజలు తమ ఇండ్లల్లోనే విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నారు.
- August 23, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHILDREN
- GANESH FESTIVAL
- KARIMNAGAR
- RAMADUGU
- గణేశ్పండుగ
- సందడి
- Comments Off on పండగ సందడే లేదు