![నిరుద్యోగులకు గుడ్న్యూస్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/sbi-2f.jpg?fit=677%2C384&ssl=1)
- డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో 3,850 జాబ్స్
- దరఖాస్తుల స్వీకరణ జూలై 27 నుంచే..
పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేస్తోంది. మొత్తం 3,850 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ సర్కిల్లోనూ ఖాళీలు ఉన్నాయి. గుజరాత్, తెలంగాణ సర్కిల్కు 550 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణతో పాటు గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభం: 2020 జూలై 27
చివరి తేదీ: 2020 ఆగస్టు 16
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ: 2020 ఆగస్టు 16
అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 2020 ఆగస్టు 31
విద్యార్హత: ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన అర్హత
వయస్సు: 2020 ఆగస్టు 1 నాటికి 30 ఏళ్ల లోపు
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థుల రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.