Breaking News

నితిన్​కు జోడీగా ఇస్మార్ట్​ పోరి ​

యువహీరో నితిన్​ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిందీలో విజయవంతమైన ‘అంధాదున్​’ చిత్రాన్ని తెలగులోకి రీమేక్​ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నితిన్​ హీరోగా ఆయన సొంత నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్నది. కాగా హీరోయిన్​ పాత్ర కోసం కొంతకాలంగా చిత్ర యూనిట్​ వేట కొనసాగిస్తున్నది. టాలీవుడ్​ టాప్​హీరోయిన్లు పూజాహేగ్డే, రష్మిక మందన్నా నో చెప్పడంతో చివరకు ఇస్మార్ట్​ భామ నబా నటేశ్​ను చాన్స్​ వరించింది. మరోవైపు అంధాదున్​లో టబు చేసిన పాత్ర కోసం నయనతారను ఎంపికచేశారు. ఇందుకోసం ఆమెకు రూ.9 కోట్లు రెమ్యునరేషన్​ ఇస్తున్నట్టు సమాచారం. మరోవైపు నితిన్​ ‘రంగ్​దే’ రీమేక్​లోనూ నటించనున్నాడు. తర్వాత చంద్రశేఖర్​ యేలేటి దర్వకత్వంలో ఓ సినిమాలోనూ, కృష్ణచైతైన్య తెరకెక్కిస్తున్న ‘పవర్​పేట’ చిత్రంలో నటించనున్నాడు.