![నాటి దుండగుల దాడిని మరిచిపోలేం..](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/12/modi3f.jpg?fit=664%2C462&ssl=1)
న్యూఢిల్లీ: పార్లమెంట్పై దాడి జరిగి ఆదివారంతో 19 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో నాటి ముష్కరుల దుశ్చర్యను గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. పార్లమెంట్పై దుండగుల దాడిని ఎప్పటికీ మరువలేమన్నారు. జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్చేశారు.2001 డిసెంబర్13న సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంట్పై దాడి చేశారు. వారిని భద్రతా దళాలు సమర్థవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, ఒక సీఆర్పీఎఫ్మహిళతో పాటు ఇద్దరు పార్లమెంట్ భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి సహా మొత్తం 9మంది అమరులయ్యారు.