కుతుబ్షాహీ సమాధుల ప్రాంగణంలో పూర్వ వైభవం….
హైదరాబాద్ గోల్కొండ సమీపంలోని చారిత్రక కుతుబ్షాహీ సమాధుల ప్రాంగణంలో పూర్వ వైభవం సంతరించుకున్న తారామతి, ప్రేమావతి టూంబ్స్ను అమెరికా రాయబారి కెన్నెత్ ఐ జస్టర్ఇటీవల ప్రారంభించారు. ఈ రెండింటి మరమ్మతులు, పూర్వ వైభవ పనుల కోసం అమెరికా రాయబార కార్యాలయం గతేడాది ఫిబ్రవరిలో 1,03,000 డాలర్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆగాఖాన్ట్రస్ట్.. మసీదులకు మరమ్మతులు చేయించడంతో.. అవి నవ్యకళను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా అమెరికా రాయబారి కెన్నెత్ఐ జస్టర్మాట్లాడుతూ.. చారిత్రక సంపద పరిరక్షణలో అమెరికా రాయబార కార్యాలయం పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. టూంబ్స్లో చారిత్రక నిర్మాణాలకు నిధులు కేటాయించడం ఇది రెండవ సారి అని పేర్కొన్నారు. 2014లో 1,01,000 డాలర్లతో టూంబ్స్లోని చారిత్రక నిర్మాణాల మ్యాపింగ్, డాక్యుమెంటేషన్నిర్వహించామని పేర్కొన్నారు. దీనిద్వారా నిర్మాణాల వైభవం, వాటి నిర్మాణశైలి గురించి తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు.