![](https://samajikasarathi.com/wp-content/themes/magazine-newspaper-pro/images/no-image.jpg)
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/allam.jpeg?resize=251%2C200&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా(కోవిడ్19) నుంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, వీడియో, ఫొటోగ్రాఫర్లకు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. ఈ మేరకు బుధవారం ప్రకటనలో కోరారు. జర్నలిస్టులు విధుల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని, వార్తల సేకరణ, ఆఫీసులో విధులు నిర్వహించే సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. మాస్క్లు, శానిటైజర్ ను వెంట తప్పనిసరిగా తీసుకెళ్లాలని కోరారు. ఆయా సంస్థలు కూడా వారికి రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సారథి ఎడిటర్ గారు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రల్లో ఈ వార్తలు చాలా చక్కగ రావడమే కాకుండా పాఠకులను ప్రెరెపించే విధంగా వార్తలు పబ్లిష్ అవుతున్నాయి. మీరు రాస్తున్న వార్తల కంటెంట్ ఇలానే కొనసాగించాలని కొరుతున్నాం సర్