Breaking News

జర్నలిస్టులూ.. జాగ్రత్త

అల్లం నారాయణ, మీడియా అకాడమీ చైర్మన్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా(కోవిడ్​19) నుంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని ప్రింట్​, ఎలక్ట్రానిక్​ మీడియా జర్నలిస్టులు, వీడియో, ఫొటోగ్రాఫర్లకు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్​ అల్లం నారాయణ సూచించారు. ఈ మేరకు బుధవారం ప్రకటనలో కోరారు. జర్నలిస్టులు విధుల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని, వార్తల సేకరణ, ఆఫీసులో విధులు నిర్వహించే సమయంలో సోషల్​ డిస్టెన్స్​ పాటించాలని కోరారు. మాస్క్​లు, శానిటైజర్ ను వెంట​ తప్పనిసరిగా తీసుకెళ్లాలని కోరారు. ఆయా సంస్థలు కూడా వారికి రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

One thought on “జర్నలిస్టులూ.. జాగ్రత్త”

  1. సారథి ఎడిటర్​ గారు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్​ రెండు రాష్ట్రల్లో ఈ వార్తలు చాలా చక్కగ రావడమే కాకుండా పాఠకులను ప్రెరెపించే విధంగా వార్తలు పబ్లిష్​ అవుతున్నాయి. మీరు రాస్తున్న వార్తల కంటెంట్ ఇలానే కొనసాగించాలని కొరుతున్నాం సర్​​

Comments are closed.