Breaking News

కేజీఎఫ్​2లో బాలీవుడ్​ స్టార్స్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్’ పాన్ ఇండియన్ చిత్రంగా అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది. ఇక ఇప్పడు‘కేజీఎఫ్ 2’పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. ఈ ‘కేజిఎఫ్ 2’లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్.. రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో హిందీలో కూడా ‘కేజీఎఫ్ 2’ పై క్రేజ్ ఏర్పడింది. ఫస్ట్ పార్ట్ లో విలన్స్ ని మించి సెకండ్ పార్ట్ లో విలన్స్ ని చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్. అందుకోసమే 2 అధీరా’ పాత్రను ప్రత్యేకంగా సృష్టించారు. ఇప్పటికే ‘అధీరా’కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారట కూడా. ఈ లాక్ డౌన్ సమయంలో దానికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తయ్యిందిట. సంజయ్ దత్ సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చాయని.. సినిమా మొత్తంలోనే అధీరా క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుందని శాండిల్ వుడ్ వర్గాల్లో అనుకుంటున్నారు. అంతేకాకుండా ‘అధీరా’ పాత్రని ‘రాకీ భాయ్’ పాత్రతో ఈక్వల్ గా తీర్చిదిద్దాడట ప్రశాంత్ నీల్. కోలార్ ఫీల్డ్ గనుల నేపథ్యంలో మాఫియా కథతో తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని హొంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మొదటి పార్ట్ కంటే మరింత గ్రాండ్ గా ఆవిష్కరిస్తున్నారని సమాచారం.