- భార్యను కాపురానికి పంపాలంటూ భర్త మౌనపోరాటం
సారథి న్యూస్, మంచిర్యాల: భర్త ఇంటి ముందు భార్య మౌనపోరాటం చేయటం కామన్ కానీ భార్య ఇంటి ముందు భర్త న్యాయపోరాటం చేయడం వెరైటీ..అలాంటి వెరైటీ ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఓ భర్త తనకు న్యాయం చేయాలని తన భార్య ఇంటి ముందు మౌనపోరాటానికి దిగాడు. వివరాల్లోకి వెళితే. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్లో ఒరుగంటి రాంకరణ్ అనే వ్యక్తి తన భార్యను కాపురానికి పంపాలంటూ అత్తగారి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగాడు. రాంకరణ్ 2014 ఆగస్టు 23న పెద్దలను ఎదిరించి లేఖ శర్మ అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా మొన్నటివరకూ వారు అన్యోన్యంగా జీవించారు. కానీ ఇటీవల ఇద్దరిమధ్య విభేదాలు రావటంతో లేఖ శర్మ పుట్టింటికి వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఇంటికి వెళ్ళాక కొన్ని రోజులకు అతడితో కాపురం చేయలేనని విడాకులు కావాలని కోరింది. ఈ క్రమంలో తన భార్య తనకు కావాలని రాంకరణ్ భార్య ఇంటిముందు మౌనపోరాటానికి దిగాడు.