Breaking News

ఒరిజినల్ ​ఇళ్లపట్టాలు ఇవ్వాలి

ఒరిజినల్​ఇళ్లపట్టాలు ఇవ్వాలి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు హౌసింగ్ కార్పొరేషన్ లో ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఎం నగర కార్యదర్శి టి.రాముడు డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇల్లు లేని పేదల సొంతింటి కల నెరవేరాలని సీఎం జగన్​30లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అభినందిస్తూ, ఇంకా చాలా మంది అర్హులైన పేదలు ఉన్నారని గుర్తుచేశారు. ఎంఏ గఫూర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2006 నుంచి 2009 వరకు మూడు విడతలుగా ఇల్లు లేని పేదలను గుర్తించి 32వేల మందికి పందిపాడు, జగన్నాథగట్టు, వెంకయ్య పల్లె, పెద్దపాడు రోడ్డులోని దాల్ మిల్లు ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు ఇప్పించారని గుర్తుచేశారు. లబ్ధిదారులకు ఒరిజినల్​పట్టా సర్టిఫికెట్​లు ఇవ్వాలని ఆయన డిమాండ్​చేశారు. సమావేశంలో సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు సీఎచ్​సాయిబాబా, ఎం.నాగరాజు, కె.సుధాకర్ పాల్గొన్నారు.