![ఏపీ ‘పోలీస్ సేవ మొబైల్ అప్లికేషన్’ ప్రారంభం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/jagan-2.jpg?fit=677%2C266&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: ‘ఏపీ పోలీస్సేవ మొబైల్యాప్’ను సోమవారం తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. టెక్నాలజీని ఉపయోగించుకుని పోలీసులంటే సేవకులని, పోలీసులంటే భయపడాల్సిన పనిలేదన్నారు. రాష్ట్రంలో పోలీసులను కుటుంబసభ్యులుగా భావించి మనం పోలీసులను ఆశ్రయించవచ్చన్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే కార్యక్రమం దిశగా ‘ఏపీ పోలీసు సేవ మొబైల్ యాప్’ ఉపయోగపడుతుందన్నారు. కర్నూలు నుంచి వీడియోకాన్ఫరెన్స్లో ఎస్పీ ఫక్కీరప్ప, ఎస్ఈబీ అడిషనల్ఎస్పీ గౌతమిసాలి, ఆంజనేయులు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాక్రిష్ణ పాల్గొన్నారు.