Breaking News

ఆర్జీవీ.. బయోపిక్

ఆర్జీవీ.. బయోపిక్


ట్రెండ్ సెట్ చేయడంలో రియల్ స్టోరీలను నిర్మోహమాటంగా తెరకెక్కించడంలో ఆర్జీవీని మించిన వారు లేరన్నది సత్యం. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఎంత నిక్కచ్చిగా ఉంటాడో అలాగే రియల్ లైఫ్ లో కూడా అంతే నిక్కచ్చిగా ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన సినిమాల కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోడు. ఎవరు ఏమన్నా కేర్ చేయడు. ఎన్నో చరిత్రలు తెరకెక్కించిన ఆర్జీవీ తన చరిత్రను కూడా తెరకెక్కనుందని కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశాడు. సంచనాలు సృష్టించే ఆర్జీవీ తన బయోపిక్ ను తానే నిర్మిస్తానని మరో సంచలన వార్త క్రియేట్ చేశాడు. మొత్తం మూడు పార్ట్​గా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట.

20 ఏళ్లు ఉన్న దొరసాయి తేజ డైరెక్టర్ కమ్ యాక్టర్​గా కనిపించనున్నాడు. ‘రాము’ అనే టైటిల్​ను ఖరారు చేస్తూ రామ్ గోపాల్ వర్మ మదర్, సిస్టర్లు ఈ రోజు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం క్లాప్ కొట్టి లాంచ్ చేశారు. ఆర్జీవీ కాలేజీ డేస్ నుంచి ప్రస్తుత స్థితి వరకూ కథనం ఉంటుందని, రామ్ గోపాల్ యుక్తవయస్సు క్యారెక్టర్ ను దొరసాయి తేజ పోషిస్తున్న ఈ చిత్రాన్ని బొమ్మాకు మురళి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా ఆర్జీవీలోని దాగి ఉన్న కోణాలు కూడా బయటపడతాయని అంటున్నారు విమర్శకులు. చిత్రం ఎప్పుడెలా విడుదల చేయనున్నారో ఇంకా రివీల్ చేయలేదు.