Breaking News

పెళ్లిలో సీఎంల సందడి

పెళ్లిలో సీఎంల సందడి

– ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

– స్పీకర్​ పోచారం మనవరాలు పెళ్లిలో

–  కేసీఆర్, వైఎస్​ జగన్​ సందడి

– హాజరైన ఇరురాష్ట్రాల ప్రముఖులు

సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆదివారం శంషాబాద్‌లో జరిగిన ఈపెళ్లికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్ ​జగన్ ​మోహన్​రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వాళ్లిద్దరూ పక్కపక్కన కూర్చొని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. స్పీకర్ ​పోచారం మనవరాలు వివాహం స్నిగ్దారెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌ రెడ్డి కుమారుడు రోహిత్‌ రెడ్డితో శంషాబాద్ అవుట్​రింగ్​ రోడ్డులోని వీఎన్‌ఆర్‌ ఫామ్ హౌజ్ లో కన్నుపండువగా జరిగింది. ఈపెళ్లి వేడుకల్లో ఏపీ అసెంబ్లీ స్పీకర్ ​తమ్మినేని సీతారాం, తెలుగు రాష్ట్రాలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.