![పెళ్లిలో సీఎంల సందడి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/21HSB06.jpg?fit=960%2C724&ssl=1)
– ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
– స్పీకర్ పోచారం మనవరాలు పెళ్లిలో
– కేసీఆర్, వైఎస్ జగన్ సందడి
– హాజరైన ఇరురాష్ట్రాల ప్రముఖులు
సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆదివారం శంషాబాద్లో జరిగిన ఈపెళ్లికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వాళ్లిద్దరూ పక్కపక్కన కూర్చొని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. స్పీకర్ పోచారం మనవరాలు వివాహం స్నిగ్దారెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డితో శంషాబాద్ అవుట్రింగ్ రోడ్డులోని వీఎన్ఆర్ ఫామ్ హౌజ్ లో కన్నుపండువగా జరిగింది. ఈపెళ్లి వేడుకల్లో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, తెలుగు రాష్ట్రాలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.