![నకిలీ పత్తి విత్తనాల పట్టివేత](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/07/seeds.jpg?fit=425%2C280&ssl=1)
సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని జల్లాపురం స్టేజీ వద్ద నకిలీ పత్తి విత్తనాలను సంబంధిత అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. అక్కడే ఉన్న మహాలక్ష్మీ హోటల్ లో 46 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలను నిల్వచేసినట్లు తెలియడంతో వ్యవసాయాధికారి శ్వేత తనిఖీచేశారు. వాటిని సీజ్చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శేఖర్ అనే వ్యక్తి ఈ హోటల్ ను అడ్డాగా చేసుకుని సీడ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని ఎస్సై ఎం.సంతోష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. రైతులకు నకిలీ విత్తనాలను అంటగడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.