![ముంబైలో నాకా వర్కర్ల మే డే వేడుకలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/05/mumbai.jpeg11.jpg?fit=652%2C268&ssl=1)
సారథి, వేములవాడ: నాకా వర్కర్ల ఆధ్వర్యంలో శనివారం ముంబైలోని పశ్చిమ విలేపార్లే నాకా వద్ద మే డే, మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విలేపార్లే నాకా వర్కర్ల సంఘం అధ్యక్షుడు చవల్ రమేష్ మాల మాట్లాడుతూ.. దేశంలో కార్మికులకు, మహిళలకు, ఉద్యోగులకు సమాన వేతనాలు, 14 గంటల నుంచి 8 గంటల వరకు కుదింపు, కార్మిక సంఘాలకు గుర్తింపు తదితర రాజ్యాంగ పరమైన హక్కులను భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించారని కొనియాడారు.
అంబేద్కర్ రూపొందించిన కనీస వేతనాల చట్టం ఇంతవరకు యజమానులు సక్రమంగా అమలుచేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్3 ప్రకారమే సాధించుకున్నామని గుర్తుచేశారు కార్మికులకు 150 మాస్కులు, 150 సానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్మికసంఘం నాయకులు నారాయణ మాల, యముల రామరావు మహరాజ్, రమేష్ మహారాజ్, మంతెన అశోక్, రాంజీ నవగడే, కొమ్ము భాస్కర్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.