Breaking News

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం.

సామాజిక సారథి , బిజీనేపల్లి: మండల కేంద్రం లో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రసిడెంట్ కరిగిల్ల దశరథం మాదిగ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం మరియు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన కులాల ఉద్యమ రథసారథి
భారత దేశ చరిత్రలో 29 సంవత్సరాలు ఎమ్మార్పీఎస్ పోరాటం తెలుగు నేల మీద ఈదుములోడిలో పుట్టిందని. మాదిగ దండోరా ఉద్యమం దేశంలో నూతన సామాజిక విప్లవాన్ని సృష్టించిందని అన్నారు. గత 29 సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని ఆధార అభిమానాలను పొంది సుదీర్ఘకాలంగా నిలబడిన రాజకీయేతర ఏకైక సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్
ఉద్యమం అని అన్నారు.అందరికన్నా అట్టడుగున ఉన్నవారికి న్యాయం చేకూరినప్పుడే రాజ్యాంగానికి ఒక అర్థం ఉంటుంది డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ స్పూర్తితో భారత దేశంలో మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణమాదిగ నేతృత్వంలో ఉద్భవించిన మహా ఉద్యమం మాదిగ దండోరా ఉద్యమం
సామాజిక అస్తిత్వ ఉద్యమాల్లో దండోరా ఉద్యమం చారిత్రకమైనదని అన్నారు. మాదిగ మరియు ఉపకులాల్లో ఆత్మస్థైర్యం.ఆత్మగౌరవానికి నాంది పలికింది. మాదిగ, మాదిగ ఉపకులాలే కాకుండా దోపిడీకి. అణచివేతకు గురైన కులాల్లో కూడా పోరాట స్ఫూర్తిని నింపిన ఉద్యమం మాదిగ దండోరా ఉద్యమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిస్ నాయకులు నరసింహ , రాములు , పరుష రాములు, తదితరులు పాల్గొన్నారు.