Breaking News

19 నుంచి గురుకుల డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్

19 నుంచి గురుకుల డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్

సారథి, వేములవాడ: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయని, ఈనెల 19 తేదీ నుంచి మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ మాతంగి కళ్యాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు www.telangana.gov.in, లేదా www.tswrais.inవెబ్ సెట్ ల లో ప్రవేశ పరీక్ష ఫలితాలను సరిచూసుకోవాలని కోరారు. మొదటి దశ కౌన్సెలింగ్ ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు తమ కళాశాలలో నిర్వహిస్తున్నామని, అర్హత సాధించిన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు టీసీ, కుల, ఆదాయపత్రాలతో పాటు పదవ తరగతి, ఇంటర్ మెమోలు, ఆధార్ కార్డు, మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో కాలేజీకి హాజరుకావాలని సూచించారు.