![గురుకుల పాఠశాలలో కరోనా కలకలం..](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/21HSB8.jpg?fit=800%2C532&ssl=1)
సామాజిక సారథి, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల పాఠశాలలో 13మంది విద్యార్థులకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు మళ్లి నమోదు కావడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయంలో విద్యార్థులు రెండు రోజులుగా కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. దీనిని గుర్తించిన పాఠశాల ప్రిన్సిపల్ కొంత మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించారు. వారిలో 13మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో పాఠశాలలోని మిగత విద్యార్థులను అప్రమత్తం చేసినట్లు పాఠశాల వర్గాలు వెల్లడించాయి.