Breaking News

క్రికెట్ చాంపియన్ ​కొంగల టీమ్​

క్రికెట్ చాంపియన్​కొంగాల టీమ్​

సారథి న్యూస్, వాజేడు: మండల కేంద్రంలోని కొంగలలో శ్రీరాములు, బొల్లె ప్రసాద్, బెల్లాల అజయ్ రాంరెడ్డి స్మారకార్థం జగన్నాథపురం యూత్​ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్​ టోర్నమెంట్​లో కొంగల జట్టు చాంపియన్​గా నిలిచింది. ఈ టోర్నీలో వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం మండలాల నుంచి 56 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్​లో భాగంగా కొంగల కింగ్స్ లెవెన్, జగన్నాథపురం రైజింగ్ స్టార్స్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కొంగల జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 127 పరుగులు చేయగా, తర్వాత బ్యాటింగ్ చేసిన జగన్నాథపురం రైజింగ్ స్టార్స్ జట్టు 88 పరుగులు చేసి ఓటమిపాలైంది. విన్నర్ గా నిలిచిన కొంగల జట్టుకు వాజేడు తహసీల్దార్​ అల్లం రాజ్ కుమార్, వెంకటాపురం సర్కిల్ సీఐ కాగితోజు శివప్రసాద్ రూ.20వేల నగదుతో పాటు సీల్డును అందజేశారు. జగన్నాథపురం జట్టుకు సీల్డు, రూ.పదివేల నగదు అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుగంధాల సాంబశివరావు, వీఆర్వో నరసింహారావు, టోర్నీ నిర్వాహకులు డ్యానీ, నాగేశ్, ఆలం శ్రీకాంత్, తోట నాగరాజు, రవి, మహేష్, అఖిల్, శ్రీధర్ పాల్గొన్నారు.

రన్నర్ గా నిలిచిన జగన్నాథపురం జట్టు