Breaking News

వాజేడులో సీసీఎఫ్ తనిఖీ

వాజేడులో సీసీఎఫ్ తనిఖీ

సారథి న్యూస్, వాజేడు: వాజేడు రేంజ్ పరిధిలోని పూసూగు బీట్ ప్లాంటేషన్​ను శుక్రవారం వరంగల్ సీసీఎఫ్ అక్బర్ తనిఖీ చేశారు. సిబ్బందిని ప్లాంటేషన్ ను ప్రతిరోజు పర్యవేక్షించి సమయానికి నీళ్లు అందించాలని ఆదేశించారు. ప్లాంటేషన్ ను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. అనంతరం ఆయన బోగత వాటర్ ఫాల్స్ను సందర్శించారు. ఆయన వెంట ములుగు జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి, ములుగు ఎఫ్ డీ వో నిఖిత, వెంకటాపురం, ఎఫ్ డీవో గోపాల్ రావు, ఏటూరునాగారం ఎఫ్ డీ వో వీణావాణి, వాజేడు ఎఫ్.ఆర్వో శ్రీనివాసన్ పాల్గొన్నారు.