![సీఎం కేసీఆర్చిత్రపటానికి క్షీరాభిషేకం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/07/jgl-2.jpg?fit=655%2C297&ssl=1)
సారథి ప్రతినిధి, జగిత్యాల: రెండవ విడత గొర్రెల పంపిణీకి సీఎం కేసీఆర్ రూ.6వేల కోట్లు కేటాయించినందుకు జగిత్యాల జిల్లా కురుమ సంఘ నాయకులు ఎమ్మెల్యే క్వార్టర్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు వొళ్లెం మల్లేశం, పట్టణాధ్యక్షుడు పుల్ల గంగారాం, ప్రధాన కార్యదర్శి పుల్ల మహేష్, చెట్టె రమేష్, సాయిల్ల మురళి, బండారి మల్లేశ్, దయ్యాల రాజాం, పుల్ల గట్టయ్య, దయాల మలారెడ్డి, పుల్ల గట్టురాజు, చెట్టె కొమురయ్య, దాయాల కిష్టయ్య పాల్గొన్నారు.