![తిష్టాత్మకంగా హరితహారం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/06/cpd-4.jpg?fit=655%2C295&ssl=1)
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ చొప్పదండి మండలంలోని రుక్మాపూర్, కొలిమికుంట గ్రామాలను బుదవారం సందర్శించారు. 7వ విడత హరితహారంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ లో మొదటి వరుసలో పూలమొక్కలు, రెండవ వరుస, మూడో వరుసలో ఇతర మొక్కలను నాటించాలని సూచించారు. రైతులు పొలం గట్ల వెంట టేకు మొక్కలను నాటించేందుకు సరైన ప్రణాళికలు రచించుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, ఎంపీడీవో స్వరూప, ఇన్చార్జ్ సర్పంచ్ ముద్దసాని చిరంజీవి, గ్రామ కార్యదర్శి ప్రవళిక, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.